హోటళ్లు, బీచ్లపై తుపాకీ గుళ్ల వర్షం
- June 26, 2015
ట్యూనీషియాలోనూ ఉగ్రవాదులు తెగబడ్డారు. రెండు పర్యాటక హోటళ్లతోపాటు, సమీపంలోని బీచ్లో తుపాకులతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 27 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. మృతుల్లో విదేశీయులు సైతం ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఘటనతో బీచ్లో సేదతీరుతున్న వారు, హోటళ్లలో ఉన్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. పరిసర ప్రాంతాలకు చెందిన వారు కూడా పేలుడు శబ్ధాలు విని ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగిందనే విషయం ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదని స్థానిక మీడియా పేర్కొంది. మృతి చెందిన వారిలో యూరప్, ఉత్తర ఆఫ్రికా దేశస్తులే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని కాల్చిచంపాయి. కాగా, ఓ ఉగ్రవాది బీచ్లో కాల్పులకు పాల్పడంతో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ట్యూనీషియా అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. మార్చి నెలలో ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు ట్యూనీషియాలోని బార్డో మ్యూజియంపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







