సిడ్నీ నుండి దుబాయ్ విమానంలో సాంకేతిక లోపం
- June 26, 2015
విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో దాన్ని అత్యవసరంగా దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసరంగా విమానాన్ని దింపడంతో ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండ చూసిన విమానం పైలెట్లను ప్రయాణికులతో పాటు అధికారులు అభినందించారు. సిడ్నీ నుండి దుబాయ్ కి ఎమిరేట్స్ విమానం ఏ-380-ఈకే 413 బయలుదేరింది. దుబాయ్ వెళుతున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని పైలెట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. పై అధికారుల అనుమతితో విమానాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అధికారులు విమానంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ సాంకేతిక లోపం వచ్చిందనేది ఆరా తీశారు. విమానంలో మొత్తం 500 మంది ప్రయాణికులు, అధికారులు ఉన్నారు. అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం వచ్చిందనేదిఅధికారులు వెల్లడించలేదు. అయితే పైలెట్ లు సమయానికి స్పందించి విమానం కిందకు దించారని అందరూ వారిని అభినందించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









