యూనీఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా ప్రాజెక్టుకు ఆమోదం
- November 09, 2023
మస్కట్: మస్కట్లో బుధవారం జరిగిన జిసిసి అంతర్గత వ్యవహారాల మంత్రుల 40వ సమావేశానికి ఒమన్ సుల్తానేట్ అధ్యక్షత వహించింది. అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ హమూద్ ఫైసల్ అల్ బుసాయిదీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. భద్రతా సవాళ్లు, నేరాలు చేయడం, సాంకేతిక పురోగతిని ఉపయోగించుకోవడం వంటి రూపాల్లో వేగవంతమైన మార్పులను ఎదుర్కోవడానికి సమన్వయం, సంప్రదింపులను బలోపేతం చేయడం కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరు జిసిసి దేశాల మధ్య నివాసితులు, పర్యాటకుల రాకపోకలను సులభతరం చేయడానికి ఏకీకృత గల్ఫ్ టూరిస్ట్ వీసా ప్రాజెక్టుకు మంత్రులు ఆమోదం తెలిపారు. అలాగే జీసీసీ దేశాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనుసంధానం చేసేందుకు మొదటి దశ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మంత్రులు ఆమోదం తెలిపారు. మాదకద్రవ్యాలను ఎదుర్కోవడానికి రూపొందించబడిన సమగ్ర గల్ఫ్ వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







