గాజా వివాదం పై చర్చించేందుకు అరబ్- ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాలు
- November 09, 2023
రియాద్: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై చర్చించేందుకు సౌదీ అరేబియా రాబోయే రోజుల్లో అరబ్- ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించనుందని సౌదీ అరేబియా పెట్టుబడి మంత్రి ఖలీద్ అల్ ఫాలిహ్ బుధవారం తెలిపారు. సింగపూర్లోని బ్లూమ్బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాబోయే కొద్ది రోజుల్లో రియాద్లో అత్యవసర అరబ్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమ్మిట్ కోసం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం సౌదీ అరేబియాకు వెళ్లనున్నారు. మార్చిలో చైనా మధ్యవర్తిత్వ ఒప్పందం ప్రకారం టెహ్రాన్ - రియాద్ సంవత్సరాల శత్రుత్వాన్ని ముగించిన తర్వాత ఇరాన్ దేశాధినేత మొదటి పర్యటన ఇది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









