పార్కింగ్ స్థలంలో Dh125,000 చోరీ..3 గంటల్లో ఛేదించిన పోలీసులు
- November 09, 2023
యూఏఈ: చోరీకి గురైన మూడు గంటల తర్వాత అజ్మాన్ పోలీసులు 125,000 దిర్హామ్లతో కూడిన బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు తన పార్క్ చేసిన కారు ముందు బ్యాగ్ను మర్చిపోయాడు. బ్యాగ్ని గుర్తించిన దొంగ దానితో పరారయ్యాడు. పని నుండి తిరిగి వచ్చిన తర్వాత రషీదియాలోని తన నివాస భవనం అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో తన కారును పార్క్ చేసినట్లు భారతీయ ఫిర్యాదుదారు పోలీసులకు చెప్పాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసు బృందం నిందితుడిని గుర్తించి, గంటల వ్యవధిలో అతని నివాస స్థలం నుండి బ్యాగ్ను స్వాధీనం చేసుకుంది. బ్యాగ్ని గుర్తించిన తర్వాత నిందితుడు ఆ బ్యాగ్తో పారిపోయినట్లు అంగీకరించినట్లు సమాచారం. అనంతరం ఫిర్యాదుదారుడికి నగదు ఉన్న బ్యాగును అందజేశారు.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









