మణిపూర్లో మొబైల్ ఇంటర్నెట్ నిషేధం
- November 09, 2023
ఇంఫాల్: మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల జరిగిన కాల్పుల్లో 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
బిష్ణూపూర్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాంగ్పోక్పి జిల్లాలో రెండు కమ్యూనిటీల మధ్య కాల్పులు జరుగుతున్నాయని మణిపూర్ డీజీపీ వెల్లడించారు. మరో ఇద్దరు వ్యక్తులు అదృశమయ్యారని, నలుగురు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు అపహరించారని తెలిపారు. దీంతో అక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే చిత్రాలు, ద్వేషపూరిత ప్రసంగాలు, వీడియోలను వ్యతిరేక వ్యక్తులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉందని, దాంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, అందుకే మొబైల్ ఇంటర్నెట్పై నిషేధం పొడిగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







