ముల్లా హైబతుల్లా అకుందాజాదాను తాలిబన్లు కొత్తనేత
- May 24, 2016
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ నేత ముల్లాహ్ అక్తార్ మన్సూర్ మృతిని తాలిబన్లు ధ్రువీకరించారు. తమ నూతన నాయకుడిగా ముల్లా హైబతుల్లా అకుందాజాదాను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా సైన్యం చేపట్టిన డ్రోన్ దాడుల్లో తాలిబన్ నేత మన్సూర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఒబామా ధ్రువీకరించారు.పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో శనివారం కారులో ప్రయాణిస్తుండగా జరిగిన దాడుల్లో మన్సూర్ మృతిచెందారని తాలిబన్లు ప్రకటన ద్వారా వెల్లడించారు. తాలిబన్ల నాయకుడు ముల్లాహ్ మహమ్మద్ ఒమర్ మరణించడంతో 2015 జులైలో మన్సూర్ను తాలిబన్ నేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు అతడి మరణంతో ముల్లా హైబతుల్లాను కొత్తనేతగా ప్రకటించారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









