ముల్లా హైబతుల్లా అకుందాజాదాను తాలిబన్లు కొత్తనేత
- May 24, 2016
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ నేత ముల్లాహ్ అక్తార్ మన్సూర్ మృతిని తాలిబన్లు ధ్రువీకరించారు. తమ నూతన నాయకుడిగా ముల్లా హైబతుల్లా అకుందాజాదాను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా సైన్యం చేపట్టిన డ్రోన్ దాడుల్లో తాలిబన్ నేత మన్సూర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఒబామా ధ్రువీకరించారు.పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో శనివారం కారులో ప్రయాణిస్తుండగా జరిగిన దాడుల్లో మన్సూర్ మృతిచెందారని తాలిబన్లు ప్రకటన ద్వారా వెల్లడించారు. తాలిబన్ల నాయకుడు ముల్లాహ్ మహమ్మద్ ఒమర్ మరణించడంతో 2015 జులైలో మన్సూర్ను తాలిబన్ నేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు అతడి మరణంతో ముల్లా హైబతుల్లాను కొత్తనేతగా ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







