ముల్లా హైబతుల్లా అకుందాజాదాను తాలిబన్లు కొత్తనేత
- May 24, 2016
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ నేత ముల్లాహ్ అక్తార్ మన్సూర్ మృతిని తాలిబన్లు ధ్రువీకరించారు. తమ నూతన నాయకుడిగా ముల్లా హైబతుల్లా అకుందాజాదాను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా సైన్యం చేపట్టిన డ్రోన్ దాడుల్లో తాలిబన్ నేత మన్సూర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఒబామా ధ్రువీకరించారు.పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో శనివారం కారులో ప్రయాణిస్తుండగా జరిగిన దాడుల్లో మన్సూర్ మృతిచెందారని తాలిబన్లు ప్రకటన ద్వారా వెల్లడించారు. తాలిబన్ల నాయకుడు ముల్లాహ్ మహమ్మద్ ఒమర్ మరణించడంతో 2015 జులైలో మన్సూర్ను తాలిబన్ నేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు అతడి మరణంతో ముల్లా హైబతుల్లాను కొత్తనేతగా ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









