దీపావళి శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్

- November 13, 2023 , by Maagulf
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్

యూఏఈ: యూఏఈలోని భారతీయ ప్రవాసులకు యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.  "యూఏఈలో..  ప్రపంచవ్యాప్తంగా దీపావళిని జరుపుకుంటున్న వారందరికీ మా శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం అందరికీ శాంతి, ఆరోగ్యం మరియు ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాము" అని ఆయన పేర్కొన్నారు. యూఏఈ ప్రెసిడెంట్ హిందీలో కూడా అదే ట్వీట్ చేసారు.  అలాగే యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా..  యూఏఈలోని నివాసితులు దీపావళి సందర్భంగా తమ బాల్కనీలను రంగు రంగుల పూవులతో అలంకరించారు. అనేక రంగులలో మెరిసే అద్భుత దీపాలను ఏర్పాటు చేశారు. దుబాయ్‌, అల్ మంఖూల్, బుర్ దుబాయ్, కరామా మరియు అల్ బర్షా వంటి ప్రాంతాల్లోని భవనాలు రంగురంగుల లైట్లతో వెలిగిపోయాయి. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com