అయిదేళ్ల చిన్నారి అత్యాచారం కేసు..నిందితుడికి మరణ శిక్ష
- November 14, 2023
కొచ్చి: కేరళలోని అలువలో జరిగిన చిన్నారి కిడ్నాప్, రేప్ కేసులో నిందితుడు అష్ఫక్ ఆలమ్ కు ఎర్నాకుళం పోక్సో కోర్టు మరణశిక్షను విధించింది. ఆ కేసులో జడ్జి కే సోమన్ తన తీర్పును ఈరోజు వెలువరించారు. ప్రాసిక్యూషన్ చేసిన వాదనలను కోర్టు అంగీకరించింది. ఇది అత్యంత అరుదైన కేసు అని, నిందితుడికి ఎటువంటి క్షమ అవసరం లేదని, సమాజానికి అతనో సమస్య అని కోర్టు తెలిపింది. 110 రోజుల పాటు ఆ కేసులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చిల్డ్రన్స్ డే సందర్భంగా తీర్పును వెల్లడించారు. ఆధారాలను ధ్వంసం చేసినందుకు అష్ఫక్కు అయిదేళ్ల జైలుశిక్ష విధించారు. మైనర్కు డ్రగ్స్ ఇచ్చినందుకు మూడేళ్ల శిక్ష, మైనర్ను రేప్ చేసినందుకు జీవితకా జైలుశిక్ష, మర్డర్ చేసినందుకు మరణశిక్షను విధిస్తున్నట్లు కోర్టు చెప్పింది. 7,70,000 జరిమానా చెల్లించాలని నిందితుడికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!