కొత్త అబుదాబి విమానాశ్రయ టెర్మినల్ నుంచి సేవలు ప్రారంభం
- November 16, 2023
యూఏఈ: డిసెంబర్లో 12 నుంచి అబుదాబి విమానాశ్రయ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. దాదాపు 220 విమానాల్లో ప్రయాణించే 2.29 మిలియన్ల మంది ప్రయాణికులు కొత్త టెర్మినల్ సేవలు అందించనుంది. నవంబర్ మొదటి రెండు వారాల్లో 1,557 విమానాలు ఇక్కడి నుంచి ట్రయల్స్ నిర్వహించారు. నెలాఖరు నాటికి, మొత్తం విమానాల సంఖ్య 7,600 కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అబుదాబి ఎయిర్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్, తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలెనా సోర్లిని మాట్లాడుతూ.. అన్ని విమానయాన సంస్థలు ఇప్పుడు టెర్మినల్ A నుండి పనిచేస్తున్నందున, అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు కొత్త శకాన్ని ప్రారంభించాయని అన్నారు. అయితే, టెర్మినల్ Aపై అధికారిక ప్రారంభోత్సవం ఫిబ్రవరి 9, 2024న జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత, విమానాశ్రయం జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చబడుతుంది.
తాజా వార్తలు
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్.. ముడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- 2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు









