యూఏఈలో భారీ వర్షాలు.. ప్రజా భద్రతా హెచ్చరిక జారీ
- November 17, 2023
యూఏఈ: అస్థిర వాతావరణ పరిస్థితులు యూఏఈని ఉక్కిరిబిక్కిరి చేశాయి. గురువారం రస్ అల్ ఖైమాలో ప్రారంభమైన భారీ వర్షాలు.. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో అనేక మంది యూఏఈ నివాసితులు భారీ వర్షాలకు ప్రభావితం అయ్యారు. దుబాయ్ పోలీసులు నివాసితులకు హెచ్చరిక పంపడంతో ఫోన్లలలో హెచ్చరికల అలెర్ట్ పంపించారు. వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, అధికారులు సూచించిన సూచనలను పాటించాలని సూచించారు. దుబాయ్లోని అబు హేల్లో భారీ వర్షం కురిసిన వీడియోను సోషల్ మీడీయాలో షేర్ చేశారు. దుబాయ్ ఐకానిక్ బుర్జ్ ఖలీఫా మెరుపులు తాకాయి.
మరోవైపు దుబాయ్ పాఠశాలలు అస్థిర వాతావరణం నేపథ్యంలో ఆన్లైన్ లెర్నింగ్ కు ఆదేశించారు. అజ్మాన్, ఉమ్ అల్ ఖువైన్ మరియు రస్ అల్ ఖైమాలోని అధికారులు కూడా రిమోట్ లెర్నింగ్ చేపట్టాలని ఆదేశించారు. NCM ప్రకారం, శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, రాత్రి మరియు శనివారం ఉదయం వాతావరణం తేమగా ఉంటుంది. దేశంలోని పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 14°Cకి పడిపోతాయని, యూఏఈలోని అంతర్గత ప్రాంతాల్లో గరిష్టంగా 33°Cకి చేరుకోవచ్చని అంచనా.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









