నవంబర్ 20 నుంచి ఖతార్ ట్రావెల్ మార్ట్
- November 17, 2023
దోహా: ఖతార్ ట్రావెల్ మార్ట్ (క్యూటిఎమ్) రెండవ ఎడిషన్ నవంబర్ 20 ( సోమవారం) దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (డిఇసిసి)లో ప్రారంభం కానుంది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి షేక్ మహ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిమ్ అల్ అబ్దుల్లా అల్ థానీ మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 22 వరకు ఈ ఎడిషన్ జరుగనుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు మార్ట్ తెరిచి ఉంటుంది. క్రీడలు, సమావేశాలు, ప్రోత్సాహకాలు, ప్రదర్శనలు (MICE), సాంస్కృతిక, విశ్రాంతి, లగ్జరీ, వైద్య మరియు హలాల్ టూరిజంతో కూడిన ఏడు కీలక రంగాలకు సంబంధించిన ప్రదర్శలను ఏర్పాటు చేయనున్నారు. స్థానిక, అంతర్జాతీయంగా డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీలు (DMCలు), టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ టెక్నాలజీ కంపెనీలు, అసోసియేషన్లు మరియు టూరిజం బోర్డులు వంటి సంస్థలను విస్తరించడం ఈ ఈవెంట్ లక్ష్యం. ఉచిత రిజిస్ట్రేషన్ కోసం www.qtmqatar.comని సందర్శించాలి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







