నవంబర్ 20 నుంచి ఖతార్ ట్రావెల్ మార్ట్
- November 17, 2023
దోహా: ఖతార్ ట్రావెల్ మార్ట్ (క్యూటిఎమ్) రెండవ ఎడిషన్ నవంబర్ 20 ( సోమవారం) దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (డిఇసిసి)లో ప్రారంభం కానుంది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి షేక్ మహ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిమ్ అల్ అబ్దుల్లా అల్ థానీ మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 22 వరకు ఈ ఎడిషన్ జరుగనుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు మార్ట్ తెరిచి ఉంటుంది. క్రీడలు, సమావేశాలు, ప్రోత్సాహకాలు, ప్రదర్శనలు (MICE), సాంస్కృతిక, విశ్రాంతి, లగ్జరీ, వైద్య మరియు హలాల్ టూరిజంతో కూడిన ఏడు కీలక రంగాలకు సంబంధించిన ప్రదర్శలను ఏర్పాటు చేయనున్నారు. స్థానిక, అంతర్జాతీయంగా డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీలు (DMCలు), టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ టెక్నాలజీ కంపెనీలు, అసోసియేషన్లు మరియు టూరిజం బోర్డులు వంటి సంస్థలను విస్తరించడం ఈ ఈవెంట్ లక్ష్యం. ఉచిత రిజిస్ట్రేషన్ కోసం www.qtmqatar.comని సందర్శించాలి.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









