నవంబర్ 20 నుంచి ఖతార్ ట్రావెల్ మార్ట్
- November 17, 2023
దోహా: ఖతార్ ట్రావెల్ మార్ట్ (క్యూటిఎమ్) రెండవ ఎడిషన్ నవంబర్ 20 ( సోమవారం) దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (డిఇసిసి)లో ప్రారంభం కానుంది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి షేక్ మహ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిమ్ అల్ అబ్దుల్లా అల్ థానీ మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 22 వరకు ఈ ఎడిషన్ జరుగనుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు మార్ట్ తెరిచి ఉంటుంది. క్రీడలు, సమావేశాలు, ప్రోత్సాహకాలు, ప్రదర్శనలు (MICE), సాంస్కృతిక, విశ్రాంతి, లగ్జరీ, వైద్య మరియు హలాల్ టూరిజంతో కూడిన ఏడు కీలక రంగాలకు సంబంధించిన ప్రదర్శలను ఏర్పాటు చేయనున్నారు. స్థానిక, అంతర్జాతీయంగా డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీలు (DMCలు), టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ టెక్నాలజీ కంపెనీలు, అసోసియేషన్లు మరియు టూరిజం బోర్డులు వంటి సంస్థలను విస్తరించడం ఈ ఈవెంట్ లక్ష్యం. ఉచిత రిజిస్ట్రేషన్ కోసం www.qtmqatar.comని సందర్శించాలి.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!