యూఏఈలో భారీ వర్షాలు.. పెరిగిన కార్ల రిపేర్లు
- November 19, 2023
యూఏఈ: యూఏఈ అంతటా కార్ రిపేర్ షాపులకు డిమాండ్ పెరిగింది. ఇటీవల వర్షాలకు కార్లు పెద్ద సంఖ్యలో డ్యామేజ్ కావడంతో పెద్ద సంఖ్యలో కార్లు గ్యారేజీలకు తరలివస్తున్నాయి. వర్షం నీరు కారణంగా ఇంజిన్ల నుండి బ్రేకింగ్ సిస్టమ్ల వరకు పాడవుతున్నాయని, దీంతో ఇటీవల మరమ్మతు కోసం వచ్చే వాహనాల సంఖ్య పెరిగిందని అల్ క్వోజ్లో ఉన్న కార్ లింక్స్లో ఆటోమొబైల్ నిపుణుడు సోనీ రాజప్పన్ అన్నారు. చాలా మంది డ్రైవర్లు పెద్ద నీటి కుంటల గుండా వెళుతున్నప్పుడు ఊహించని విధంగా నీటి కొలనులలో చిక్కుకుపోవడంతో చాలా వాహనాలు రిపేర్లకు వస్తున్నాయి. చాలా మంది కార్ల తయారీదారులు తమ ఎయిర్ ఫిల్టర్ ఇన్లెట్లను తక్కువ స్థానంలో ఉంచారని, ఈ ఇన్లెట్ నీటిలో మునిగిపోయి, డ్రైవర్ ఇంజిన్ను ఆన్ చేయగానే ప్రమాద తవ్రత పెరిగి ఇంజిన్ సీజింగ్కు దారితీసే అవకాశం ఉందని సోనీ తెలిపారు. అలాగే తాజా కార్ మోడళ్లలో ఎలక్ట్రిక్ స్టీరింగ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ మరియు బ్రేక్ సెన్సార్ల కోసం సర్క్యూట్ మాడ్యూల్ టైర్ స్థాయిలో తక్కువగా ఉంటుందని, ఈ ప్రాంతంలో నీరు చేరితే అది పనిచేయకపోవటానికి దారితీస్తుందన్నారు. వర్షాకాలంలో సెడాన్లు, హ్యాచ్బ్యాక్లు మరియు కన్వర్టిబుల్స్ వంటి తక్కువ అంతస్తుల కార్లను ఉపయోగించవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ కాలంలో అధిక-గ్రౌండ్-క్లియరెన్స్ వాహనాలను ఎంచుకోవడం వలన నీటితో నిండిన రోడ్లకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గుతుందన్నారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







