వార్నింగ్ సైరన్లను పరీక్షించనున్న కువైట్
- November 20, 2023
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క సాధారణ పౌర రక్షణ విభాగం నవంబర్ 21వ తేదీన (మంగళవారం) ఉదయం 10:00 గంటలకు సైరన్ల టోన్ల గురించి పౌరులు, నివాసితులకు అవగాహన కల్పించేందుకు హెచ్చరిక(వార్నింగ్) సైరన్లను పరీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సైరన్ల వివిధ టోన్లు, సూచనల గురించి అవగాహన కల్పించడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశ్యం అని మంత్రిత్వ శాఖ ఆపరేషన్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్-జనరల్ జమాల్ అల్-సాయెగ్ తెలిపారు. సైరన్ టోన్ లేదా సంబంధిత వాయిస్ మెసేజ్ వినబడకపోతే పౌర రక్షణ కార్యకలాపాలకు నంబర్ 25379278కు ఫోన్ చేయాలని ప్రకటన పౌరులను కోరింది. పౌరులు, నివాసితులకు అత్యవసర లేదా ప్రమాదం సంభవించినప్పుడు తప్పనిసరిగా తీసుకోవలసిన భద్రతా జాగ్రత్తలను గుర్తు చేయడానికి ఇటువంటి పరీక్షలను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







