విదేశాలకు వెళ్లే వారికి ముఖ్య గమనిక..
- November 21, 2023
న్యూ ఢిల్లీ: విదేశాలకు వెళ్లేవారు ఇలాంటి విషయాలను తప్పక తెలుసుకోవాలి..ఎందుకంటే.. ప్రయాణీకుడు నిర్దిష్ట పరిమితిలోపు మాత్రమే వస్తువులు, నగదును తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. అలాకాకుండా పరిమితికి మించి తీసుకెళ్లినా ఇంటికి పంపిస్తారు. కాబట్టి, ప్రయాణానికి ముందు అలాంటి నియమాల గురించి తప్పక తెలుసుకోవాలి. వెళ్లిన చోట ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదుర్కొకుండా ఉండేందుకు పర్యాటకులు వీలైనంత ఎక్కువ నగదును తమ వద్ద ఉంచుకుంటారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే కొంత పరిమితిలోపు నగదును తీసుకెళ్లాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళీకృత రెమిటెన్స్ పథకం ప్రకారం, భారతీయ ప్రయాణికులు కేవలం రూ. 1.89 కోట్లు మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతి ఉంది.
నేపాల్, భూటాన్ వంటి కొన్ని దేశాలు మినహా దాదాపు అన్ని దేశాలకు ప్రయాణించే ప్రయాణీకులు ఒక ప్రయాణానికి $3000 వరకు విదేశీ కరెన్సీని తీసుకువెళ్లడానికి అనుమతి ఉంటుంది.. మీరు ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకెళ్లాలనుకుంటే, మీరు దానిని స్టోర్ వాల్యూ కార్డ్, ట్రావెలర్స్ చెక్, బ్యాంకర్ డ్రాఫ్ట్ రూపంలో తీసుకెళ్లవచ్చు.
ఒక భారతీయ యాత్రికుడు నేపాల్, భూటాన్ కాకుండా మరే ఇతర దేశానికి తాత్కాలిక పర్యటనకు వెళ్తున్నట్టయితే.. అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు భారతీయ కరెన్సీ నోట్లను తిరిగి తీసుకురావచ్చు. అయితే ఈ మొత్తం రూ.25 వేలకు మించకూడదని గుర్తుంచుకోవాలి. నేపాల్, భూటాన్ గురించి చర్చించుకున్నట్టయితే.. అక్కడ నుండి తిరిగి వచ్చే సమయంలో ఎవరూ భారత ప్రభుత్వ కరెన్సీ నోట్లను 100 రూపాయల కంటే ఎక్కువ విలువైన RBI నోట్లను తీసుకెళ్లలేరు.
తాజా వార్తలు
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత









