దుబాయ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో 'పుస్తక శ్రవణం'

- May 26, 2016 , by Maagulf
దుబాయ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో 'పుస్తక శ్రవణం'

'ఇయర్‌ ఆఫ్‌ రీడింగ్‌' అనే కార్యక్రమంలో భాగంగా, దుబాయ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఇకపై ప్రయాణీకులకు 'పుస్తకాల్ని' వినిపించనుంది. రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించిన దుబాయ్‌ మెట్రో, ఆర్‌టిఏ బస్సుల్లో డిజిటల్‌ పద్ధతిలో పుస్తకాల్లోని విషయాల్ని ప్రయాణీకులకు విన్పించేలా చేయబోతున్నారు. దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ స్ట్రేటజీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ గవర్నెన్స్‌ అసిస్టెంట్‌ జెక్రెటరీ జనరల్‌ ఐషా అబ్దుల్లా మిరన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో ఈ ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంట్‌ చేస్తామని వివరించారామె. 'లెర్నింగ్‌ త్రూ రీడింగ్‌' అనే కాన్సెప్ట్‌ని ప్రమోట్‌ చేయడానికి 162 ఇనీషియేటివ్స్‌ ముందుకు వచ్చాయనీ, వాటిల్లో కొన్ని ఇప్పటికే అమల్లో ఉండగా, మరికొన్ని ఈ ఏడాది చివరి నాటికి ఎగ్జిక్యూట్‌ చేయబడ్తాయని చెప్పారు ఐషా అబ్దుల్లా మిరన్‌. త్వరలో దుబాయ్‌ కల్చర్‌ అండ్‌ ఆర్ట్స్‌ సొసైటీ ద్వారా మొబైల్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించనున్నామని ఆమె వివరించారు. వర్క్‌షాప్‌లను నిర్వహించి, పిల్లలు తమ నాలెడ్జ్‌ని పెంచుకునేలా చేయడం అలాగే కథలు రాసేలా వారిలోని టాలెంట్‌ని వెలికి తీసేలా సహాయ సహకారాలు అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారామె. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com