దుబాయ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో 'పుస్తక శ్రవణం'
- May 26, 2016
'ఇయర్ ఆఫ్ రీడింగ్' అనే కార్యక్రమంలో భాగంగా, దుబాయ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇకపై ప్రయాణీకులకు 'పుస్తకాల్ని' వినిపించనుంది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన దుబాయ్ మెట్రో, ఆర్టిఏ బస్సుల్లో డిజిటల్ పద్ధతిలో పుస్తకాల్లోని విషయాల్ని ప్రయాణీకులకు విన్పించేలా చేయబోతున్నారు. దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్ట్రేటజీ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ అసిస్టెంట్ జెక్రెటరీ జనరల్ ఐషా అబ్దుల్లా మిరన్ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామని వివరించారామె. 'లెర్నింగ్ త్రూ రీడింగ్' అనే కాన్సెప్ట్ని ప్రమోట్ చేయడానికి 162 ఇనీషియేటివ్స్ ముందుకు వచ్చాయనీ, వాటిల్లో కొన్ని ఇప్పటికే అమల్లో ఉండగా, మరికొన్ని ఈ ఏడాది చివరి నాటికి ఎగ్జిక్యూట్ చేయబడ్తాయని చెప్పారు ఐషా అబ్దుల్లా మిరన్. త్వరలో దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ సొసైటీ ద్వారా మొబైల్ బుక్ ఎగ్జిబిషన్ని ప్రారంభించనున్నామని ఆమె వివరించారు. వర్క్షాప్లను నిర్వహించి, పిల్లలు తమ నాలెడ్జ్ని పెంచుకునేలా చేయడం అలాగే కథలు రాసేలా వారిలోని టాలెంట్ని వెలికి తీసేలా సహాయ సహకారాలు అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారామె.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









