నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- November 28, 2023హైదరాబాద్: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వలేదని, ఈసారి అలా జరిగితే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.
తెలంగాణలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎక్కడ కూడా నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదు. నవంబర్ 30వ తేదీ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ ఉంటుంది.
సాయంత్రం 5 గంటల తరువాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేయవద్దని ఈసీ సూచించింది. సాయంత్రం 5 గంటల తరువాత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు..
- అంతర్జాతీయ ఈఎన్టీ సమ్మిట్ నిర్వహించిన మెడికవర్ హాస్పటల్స్
- అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు..విధ్వంసానికి ISI భారీ కుట్ర!
- ఏపికి కొత్త ఐపీఎస్లు..కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల..!
- 'మడా' కార్డులతో 22% పెరిగిన ఈ-కామర్స్..!
- ఒమానీ-బహ్రెయిన్ ప్రదర్శన..సలాలాలో ఆకట్టుకుంటున్న 4వ ఎడిషన్
- సెలవుల కోసం వెళ్తుండగా ప్రవాస భారతీయుడు మృతి..!
- 'పారిస్ 2024' ఒలింపిక్స్.. ప్రారంభోత్సవంలో పాల్గొన్న అమీర్
- యూఏఈ లో జెట్ స్కీ ప్రమాదం.. ఓ వ్యక్తిని రక్షించిన కోస్ట్ గార్డ్
- దుబాయ్ లో రోడ్ స్టంట్స్.. 50,000 దిర్హామ్లు జరిమానా