రికార్డు స్థాయిలో ధరలు పెరిగినా బంగారం ఎందుకు కొంటున్నారు?
- December 05, 2023
యూఏఈ: రికార్డు స్థాయిలో ధరలు ఉన్నప్పటికీ యూఏఈ చుట్టూ ఉన్న బంగారు దుకాణాలు వ్యాపారంలో వృద్ధిని నమోదు చేస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయడానికి ప్రజలు తరలిరావడంతో దేశవ్యాప్తంగా దుకాణాలు వద్ద భారీగా రద్దీ కనిపిస్తుంది. ఇండస్ట్రీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం ధరలు పెరుగుతాయనే అంచనా. నిష్కా జ్యువెలరీ చైర్మన్ నిషిన్ తస్లిమ్ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో అమ్మకాలలో చెప్పుకోదగ్గ పెరుగుదలను చూశామన్నారు,. శుక్రవారం, బంగారం ఔన్స్కి $2,075ను తాకింది. మేలో దాదాపుగా $2,079-2,080 జోన్లో ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరేందుకు దగ్గరగా ఉంది. జైబా జ్యువెలర్స్ జనరల్ మేనేజర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. దుబాయ్లోని అన్ని ఔట్లెట్లలో కంపెనీ అమ్మకాలు పెరిగాయని చెప్పారు. బంగారం ధరలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నందున బంగారం కొనుగోళ్లు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కూడా అధిక విక్రయాలు జరుగుతున్నాయని సురేష్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







