రికార్డు స్థాయిలో ధరలు పెరిగినా బంగారం ఎందుకు కొంటున్నారు?
- December 05, 2023
యూఏఈ: రికార్డు స్థాయిలో ధరలు ఉన్నప్పటికీ యూఏఈ చుట్టూ ఉన్న బంగారు దుకాణాలు వ్యాపారంలో వృద్ధిని నమోదు చేస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయడానికి ప్రజలు తరలిరావడంతో దేశవ్యాప్తంగా దుకాణాలు వద్ద భారీగా రద్దీ కనిపిస్తుంది. ఇండస్ట్రీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం ధరలు పెరుగుతాయనే అంచనా. నిష్కా జ్యువెలరీ చైర్మన్ నిషిన్ తస్లిమ్ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో అమ్మకాలలో చెప్పుకోదగ్గ పెరుగుదలను చూశామన్నారు,. శుక్రవారం, బంగారం ఔన్స్కి $2,075ను తాకింది. మేలో దాదాపుగా $2,079-2,080 జోన్లో ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరేందుకు దగ్గరగా ఉంది. జైబా జ్యువెలర్స్ జనరల్ మేనేజర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. దుబాయ్లోని అన్ని ఔట్లెట్లలో కంపెనీ అమ్మకాలు పెరిగాయని చెప్పారు. బంగారం ధరలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నందున బంగారం కొనుగోళ్లు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కూడా అధిక విక్రయాలు జరుగుతున్నాయని సురేష్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







