గొంతు నొప్పికి ఉపశమనం పొందండిలా
- June 27, 2015
సాధారణంగా జలుబు చేస్తుందంటే ముందు గొంతు నొప్పి బాధిస్తుంటుంది. గొంతులో మంట, నొప్పి ఉండి ఏం తినాలన్నా, మాట్లాడాలన్నా అసౌకర్యంగా ఉంటుంది. అయితే దీనికి ఏ ఇంగ్లీష్ మెడిసన్ వేసుకుందామన్నా అంత రిలీఫ్ కనిపించదు. కానీ మన వంటిట్లో చేసుకునే చిన్న చిన్న చిట్కాల ద్వారా దీన్ని కొంత వరకూ తగ్గించుకోవచ్చు. వేడి నీళ్లలో లేదా గ్రీన్ టీలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే గొంతునొప్పికి కొంత మేర ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు తేనెలో ఇన్ఫెక్షన్లు తగ్గించే కారకాలుండడం వల్ల తొందరగా దీనికి ఉపశమనం కలుగుతుంది.క్యారెట్ను సన్నగా తురిమి దాన్ని మెత్తగా ఉడికించి, అది వేడి వేడిగా ఉన్నప్పుడే గొంతుకు వేడి తెలిసేలా తినాలి. దీంతో గొంతు నొప్పి తగ్గడమే కాకుండా క్యారెట్లోని విటమిన్లూ శరీరానికి మంచి చేస్తాయి. వేడి వేడిగా సూప్స్(చికెన్ లేదా వెజిటెబుల్ సూప్స్) తీసుకోవడం వల్ల కూడా గొంతు నొప్పికి ఉపశమనం కల్గుతుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







