గొంతు నొప్పికి ఉపశమనం పొందండిలా
- June 27, 2015
సాధారణంగా జలుబు చేస్తుందంటే ముందు గొంతు నొప్పి బాధిస్తుంటుంది. గొంతులో మంట, నొప్పి ఉండి ఏం తినాలన్నా, మాట్లాడాలన్నా అసౌకర్యంగా ఉంటుంది. అయితే దీనికి ఏ ఇంగ్లీష్ మెడిసన్ వేసుకుందామన్నా అంత రిలీఫ్ కనిపించదు. కానీ మన వంటిట్లో చేసుకునే చిన్న చిన్న చిట్కాల ద్వారా దీన్ని కొంత వరకూ తగ్గించుకోవచ్చు. వేడి నీళ్లలో లేదా గ్రీన్ టీలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే గొంతునొప్పికి కొంత మేర ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు తేనెలో ఇన్ఫెక్షన్లు తగ్గించే కారకాలుండడం వల్ల తొందరగా దీనికి ఉపశమనం కలుగుతుంది.క్యారెట్ను సన్నగా తురిమి దాన్ని మెత్తగా ఉడికించి, అది వేడి వేడిగా ఉన్నప్పుడే గొంతుకు వేడి తెలిసేలా తినాలి. దీంతో గొంతు నొప్పి తగ్గడమే కాకుండా క్యారెట్లోని విటమిన్లూ శరీరానికి మంచి చేస్తాయి. వేడి వేడిగా సూప్స్(చికెన్ లేదా వెజిటెబుల్ సూప్స్) తీసుకోవడం వల్ల కూడా గొంతు నొప్పికి ఉపశమనం కల్గుతుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







