గొంతు నొప్పికి ఉపశమనం పొందండిలా
- June 27, 2015
సాధారణంగా జలుబు చేస్తుందంటే ముందు గొంతు నొప్పి బాధిస్తుంటుంది. గొంతులో మంట, నొప్పి ఉండి ఏం తినాలన్నా, మాట్లాడాలన్నా అసౌకర్యంగా ఉంటుంది. అయితే దీనికి ఏ ఇంగ్లీష్ మెడిసన్ వేసుకుందామన్నా అంత రిలీఫ్ కనిపించదు. కానీ మన వంటిట్లో చేసుకునే చిన్న చిన్న చిట్కాల ద్వారా దీన్ని కొంత వరకూ తగ్గించుకోవచ్చు. వేడి నీళ్లలో లేదా గ్రీన్ టీలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే గొంతునొప్పికి కొంత మేర ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు తేనెలో ఇన్ఫెక్షన్లు తగ్గించే కారకాలుండడం వల్ల తొందరగా దీనికి ఉపశమనం కలుగుతుంది.క్యారెట్ను సన్నగా తురిమి దాన్ని మెత్తగా ఉడికించి, అది వేడి వేడిగా ఉన్నప్పుడే గొంతుకు వేడి తెలిసేలా తినాలి. దీంతో గొంతు నొప్పి తగ్గడమే కాకుండా క్యారెట్లోని విటమిన్లూ శరీరానికి మంచి చేస్తాయి. వేడి వేడిగా సూప్స్(చికెన్ లేదా వెజిటెబుల్ సూప్స్) తీసుకోవడం వల్ల కూడా గొంతు నొప్పికి ఉపశమనం కల్గుతుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









