బహ్రెయిన్ లో పులకించిన ఆధ్యాత్మికత
- June 27, 2015
ఈ నెల 27 వ తేదీ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యం లో తెలుగు వారు 'భక్తీ సమ్మేళనం' నిర్వహించారు.
ఈ కార్యక్రమము లో తెలుగు వారు వందలాది మంది పాల్గున్నరు. ఈ కార్యక్రమము ఆద్యంతం భక్తుల గానామృతం తో . వక్తుల ప్రవచనాలు తో సాగింది శ్రీ వరదరాజ చార్యులు మాట్లాడుతూ తన అమూల్య సందేశాన్ని ఇచ్చారు .. ఎల్లప్పుడూ భగవంతుడుని ధ్యానించాలి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెల్లాలి . ప్రతి ఒక్కరు భగవన్నామ స్మరణ చెస్తూ ఉంటే మానసిక శాంతి కలుగుతుంది తెలుగు వారు అంతా కలసి ఈ కార్యక్రమము చెయ్యడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని ఈ కార్య క్రమాన్ని ముందుండి నడిపించిన అటువంటి హరిబాబు గారి ని ప్రశంసించారు. అలాగే శ్రీమతి వకుల దేవి గారు గంగ సాయన్న గారు సౌమ్య గారు శ్రీరాం గారు అన్నమయ్య కీర్తనలు తో భక్తీ పారవశ్యం లో ముంచి వెత్తారు. తరువాత అంతా కలసి మహాప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్య క్రమము లో శ్రామిక బంధు శివకుమార్ గారు ... మరియు కార్యవర్గ సభ్యులు పాల్గున్నారు. మా గల్ఫ్ ప్రతినిధి వాసుదేవ రావు గారు తో శివకుమార్ గారు హరిబాబు గారు మాట్లాడుతూ ఈలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకొని ఆధ్యాత్మిక భావనులు తో ముందుకు వెళ్ళాలని అన్నారు జీవితం లో చివరకు మిగిలేది భక్తిభావం మాత్రమే దీనిని అందరు గుర్తు పెట్టుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.ఈ కార్యక్రమము ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







