బహ్రెయిన్ లో పులకించిన ఆధ్యాత్మికత
- June 27, 2015
ఈ నెల 27 వ తేదీ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యం లో తెలుగు వారు 'భక్తీ సమ్మేళనం' నిర్వహించారు.
ఈ కార్యక్రమము లో తెలుగు వారు వందలాది మంది పాల్గున్నరు. ఈ కార్యక్రమము ఆద్యంతం భక్తుల గానామృతం తో . వక్తుల ప్రవచనాలు తో సాగింది శ్రీ వరదరాజ చార్యులు మాట్లాడుతూ తన అమూల్య సందేశాన్ని ఇచ్చారు .. ఎల్లప్పుడూ భగవంతుడుని ధ్యానించాలి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెల్లాలి . ప్రతి ఒక్కరు భగవన్నామ స్మరణ చెస్తూ ఉంటే మానసిక శాంతి కలుగుతుంది తెలుగు వారు అంతా కలసి ఈ కార్యక్రమము చెయ్యడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని ఈ కార్య క్రమాన్ని ముందుండి నడిపించిన అటువంటి హరిబాబు గారి ని ప్రశంసించారు. అలాగే శ్రీమతి వకుల దేవి గారు గంగ సాయన్న గారు సౌమ్య గారు శ్రీరాం గారు అన్నమయ్య కీర్తనలు తో భక్తీ పారవశ్యం లో ముంచి వెత్తారు. తరువాత అంతా కలసి మహాప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్య క్రమము లో శ్రామిక బంధు శివకుమార్ గారు ... మరియు కార్యవర్గ సభ్యులు పాల్గున్నారు. మా గల్ఫ్ ప్రతినిధి వాసుదేవ రావు గారు తో శివకుమార్ గారు హరిబాబు గారు మాట్లాడుతూ ఈలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకొని ఆధ్యాత్మిక భావనులు తో ముందుకు వెళ్ళాలని అన్నారు జీవితం లో చివరకు మిగిలేది భక్తిభావం మాత్రమే దీనిని అందరు గుర్తు పెట్టుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.ఈ కార్యక్రమము ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









