తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ ఇవ్వబోతున్న ఆటో డ్రైవర్లు..?
- December 09, 2023
హైదరాబాద్: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలు ఉచిత బస్సు సౌకర్యం కలిపిస్తామని హామీ ఇచ్చిన రేవంత్..చెప్పినట్లే మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు. ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకరాబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది.
తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే.. హైదరాబాద్ లోని ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగేందుకు సిద్ధం అయ్యారు. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తే…తమ బతుకులు ఆగం అవుతాయని..వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఆధారిత వాహనాలపై ఆధారపడి బతుకుబండిని లాగుతున్న డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని వాపోయారు. కాంగ్రెస్ ఆటో రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు ఆటో డ్రైవర్లు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ









