గాజా కాల్పుల విరమణ తీర్మానంపై యూఎస్ వీటో.. అరబ్ దేశాలు ఆగ్రహం
- December 10, 2023
వాషింగ్టన్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ నేతృత్వంలోని అరబ్ మరియు ముస్లిం దేశాల మంత్రులు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం UNSC తీర్మానాన్ని అడ్డుకునేందుకు అమెరికా వీటోను ఉపయోగించడంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జాయింట్ అరబ్-ఇస్లామిక్ ఎక్స్ట్రార్డినరీ సమ్మిట్ ద్వారా కేటాయించబడిన మంత్రివర్గ కమిటీ, ఇజ్రాయెల్ ఆక్రమణను తక్షణమే ఆపివేయడానికి యునైటెడ్ స్టేట్స్ బాధ్యత వహించాలని, అవసరమైన చర్యలను తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గాజాలో పాలస్తీనా ప్రజలపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా వారు తమ ఐక్య వైఖరిని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మానవతా చట్టానికి అనుగుణంగా పౌరుల రక్షణకు భరోసానిస్తూ, శత్రుత్వాలను తక్షణమే మరియు సమగ్రంగా నిలిపివేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ తీర్మానాలకు అనుగుణంగా జూన్ 4, 1967 సరిహద్దుల వెంబడి పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని వారు సూచించారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









