కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- December 10, 2023![1 కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి](https://www.maagulf.com/godata/articles/202312/bb_1702204323.jpg)
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఘెర ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చిక్ బళ్లాపూర్ లో కారు అదుపుతప్పి చెరువులో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చిక్ బళ్లాపూర్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సివుంది.
కాగా, అక్టోబర్ నెలలో చిక్ బళ్లాపూర్ 44వ జాతీయ రహదారిపై కారు ట్రక్కును ఢీకొనడంతో 13 మంది మృతి చెందారు. చిక్ బళ్లాపూర్ శివారులోని బెంగళూరు-హైదరాబాద్ హైవేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ మిక్సర్ లారీని మల్టీ యుటిలిటీ వెహికల్ (ఎంయూవీ) ఢీకొట్టింది.
దీంతో ఆరేళ్ల బాలుడు, నలుగురు మహిళలు, పీయూ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సహా 13 మంది మృతి చెందారు. బెంగళూరు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కబళ్లాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
చిత్రావతి జంక్షన్ వద్ద ఉదయం 6.30 గంటలకు 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో, సిమెంట్ మిక్సర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- జనతా క్యాంటీన్ల పై ఈవో ప్రత్యేక దృష్టి
- సినారె 93వ జయంతికి సీఎం రేవంత్ కి ఆహ్వానం
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్