ఇండియా, సింగపూర్ పర్యటనకు సుల్తాన్
- December 11, 2023
మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ డిసెంబర్ 13 నుండి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. “అతని మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ డిసెంబర్ 13 నుండి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా దేశాలలో పర్యటిస్తారు. ఈ రెండు పర్యటనలలో ఒమన్ మరియు రెండు దేశాల మధ్య సహకార రంగాలపై చర్చలు జరుపుతారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం, మూడు దేశాల ప్రజల కోసం మరింత శ్రేయస్సు సాధించడానికి వివిధ రంగాలలో ఈ సంబంధాలను ప్రోత్సహించే మార్గాలపై సమీక్ష నిర్వహిస్తారు. రెండు సందర్శనల సమయంలో హిజ్ మెజెస్టి ది సుల్తాన్, రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హెచ్హెచ్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్, దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి హెచ్హెచ్ సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసాయిదీతో కూడిన అధికారిక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళుతుందని వెల్లఢించింది.
తాజా వార్తలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!









