దుబాయ్లో సద్గురు ఆధ్యాత్మిక కార్యక్రమం: భారీగా హాజరైన ప్రజలు
- December 11, 2023
యూఏఈ: కోకా-కోలా అరేనాలో ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక గురువైన సద్గురు నిర్వహించిన ఆధ్యాత్మిక సమావేశానికి వివిధ సంఘాలు, జాతీయతలకు చెందిన 20,000 మంది ప్రజలు హాజరయ్యారు. భారతీయ సాంప్రదాయక వస్త్రధారణతో సద్గురు పాల్గొన్నవారికి మార్గనిర్దేశం చేశారు. అంతర్గత పరివర్తన, ఆధ్యాత్మిక వృద్ధిని సాధించడం, అంతర్గత శాంతి మరియు సామరస్యం సహజ స్థితిని కనుగొనడంపై దిశానిర్దేశం చేశారు. హాజరైనవారు యోగా, ధ్యానం వంటి బోధనలతో సహా ఆధ్యాత్మిక అభ్యాసాలలో నిమగ్నమయ్యారు. “సద్గురు సమావేశంలో పాల్గొనడం ఇది రెండోసారి. మొదటిసారి అమెరికాలో హాజరయ్యా. నేను అంతర్గత శాంతిని పొందడం కోసం ఆధ్యాత్మిక గురువు బోధనలను వింటాను. ”అని దుబాయ్ పర్యటనలో ఉన్న రష్యన్ గాలెనా చెప్పారు. "సద్గురు బోధనలు నిజంగా నన్ను కదిలించింది. అక్కడ అతను ఆధ్యాత్మికతలోకి ప్రవేశించడం గురించి మరియు అతను అనుభవించే వాటిని ప్రపంచం ఎలా అనుభవించాలని అతను కోరుకుంటున్నాడో ప్రస్తావించారు" అని దుబాయ్లో నివసిస్తున్న కొలంబియన్ ప్రవాస కయా మగ్డేలానా అన్నారు. ఈ సందర్భంగా వేదిక వద్ద జరిగిన ఆధ్యాత్మిక సంగీత కచేరీ ఈవెంట్లో హైలైట్గా నిలిచింది.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







