సెట్-టాప్ బాక్స్లపై సైబర్ అటాక్: టీవీ స్క్రీన్లపై గాజా కంటెంట్ ప్రసారం
- December 11, 2023
యూఏఈ: సెట్-టాప్ బాక్స్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడి జరిగింది.దీంతో చాలా మంది యూఏఈ నివాసితులు ఆదివారం రాత్రి వారి టెలివిజన్ కార్యక్రమాలకు ఊహించని అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాగతాల గురించిన సమాచారంతో సాధారణ కంటెంట్ స్థానంలో టెలికాస్ట్ చేశారు. యూరోపియన్ లైవ్ ఛానెల్లలో అకస్మాత్తుగా ఈ విధంగా మార్పులు చోటుచేసుకున్నాయని సబ్స్క్రైబర్లు వెల్లడించారు. "మీకు ఈ సందేశాన్ని అందించడానికి హ్యాక్ చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు" అని పేర్కొన్న సందేశాన్ని తొలుత స్క్రీన్లపై ప్రదర్శించారు. అనంతరం, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ పిల్లలు మరియు మహిళల దుస్థితిపై బులెటిన్ను AI వార్తా యాంకర్ ప్రసారం చేశారు. "నేను రాత్రి 10.30 గంటల సమయంలో BBC న్యూస్ని చూస్తున్నాను, దానికి బదులుగా, పాలస్తీనా నుండి భయంకరమైన విజువల్స్ నా స్క్రీన్పై కనిపించాయి. నా స్క్రీన్ స్తంభించిపోయింది. హ్యాకర్ నుండి ఒక సందేశం ఆకుపచ్చ నేపథ్యానికి వ్యతిరేకంగా అన్ని క్యాప్లలో పాప్-అప్ చేయబడింది. దీని తర్వాత వెంటనే AI యాంకర్ అందించిన వార్తా బులెటిన్ వచ్చింది. ఇది అతివాస్తవికంగా మరియు భయానకంగా ఉంది." అని దుబాయ్ నివాసి తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా, సంబంధిత సబ్స్క్రైబర్ల నుండి వచ్చిన కంప్లయిట్లపై సెట్-టాప్ బాక్స్ ప్రొవైడర్లు స్పందించారు. తమ సిస్టమ్లు హ్యాక్ చేయబడిందని అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పారు. సమస్యను చురుగ్గా పరిశీలిస్తున్నామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







