సీఎం రేవంత్ రెడ్డి CPROగా బోరెడ్డి అయోధ్య రెడ్డి

- December 12, 2023 , by Maagulf
సీఎం రేవంత్ రెడ్డి CPROగా బోరెడ్డి అయోధ్య రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో పాలనను పరుగులుపెట్టించేందుకు అధికార యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీమ్‌ను మొత్తం మార్చేసి కొత్త అధికారులను రంగంలోకి దించారు. సీఎంకు సీపీఆర్‌వోగా బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమించారు. ఆయన మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేశారు. పార్టీలో రేవంత్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తిని తీసుకున్నారు. రేవంత్ రెడ్డి కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను నియమించారు. ఈయన ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం మల్టీ జోన్ 2 పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com