స్వీట్ రైస్ బాల్స్
- May 27, 2016
కావలసిన పదార్థాలు: మైదా - రెండు కప్పులు, కొబ్బరిపాలు - 1/3 క్యాన్ (తీపి కోసం పంచదార కలుపుకోవచ్చు), బ్రౌన్ షుగర్ - ఒక కప్పు, ఎండు కొబ్బరి తురుము - అరకప్పు, నూనె - అర టీస్పూన్, ఆకుపచ్చ ఫుడ్ కలర్-అర టీస్పూన్ (నచ్చిన రంగు వాడుకోవచ్చు).
తయారీ విధానం: మైదాలో కొబ్బరి పాలు కలిపి పిండి ముద్ద చేయాలి. (కొబ్బరిపాల చిక్కదనాన్ని బట్టి మరికాస్త కొబ్బరిపాలు పోయడం లేదా పిండి కలపడం వంటివి అవసరం అవుతాయి.) ఈ ముద్ద చేతికి అంటుకోకుండా గట్టిగా ఉండాలి. పిండి కలిపేటప్పుడే ఆకుపచ్చరంగు కలపాలి. పిండి బాగా కలిపాక చిన్న చిన్న ఉండలు చేయాలి. ఆ ఉండల్ని చదునుగా నొక్కి అర టీస్పూన్ బ్రౌన్ షుగర్ని పోసి నెమ్మదిగా చేతి వేలితో తట్టి మళ్లీ ఉండలు చేయాలి. వీటిని ఒక పళ్లెంలో పెట్టి బియ్యప్పిండిని చల్లాలి. ఒక పెద్ద గిన్నెలో నీళ్లుపోసి ఎక్కువ మంటమీద పెట్టాలి. ఉడుకుతున్న నీళ్లలో రైస్ బాల్స్ వేయాలి. నీళ్లలో వేయగానే గిన్నె అడుగుకి చేరుకుని ఆ తరువాత నెమ్మదిగా పైకి వస్తాయి. ఉండలు పైకి తేలాక మంట తగ్గించి నాలుగు నిమిషాలు అలానే ఉంచాలి. ఉండలు ఉడుకుతున్నప్పుడే కూరగాయలు కోసే బోర్డు మీద నూనె పూయాలి. చిల్లుల గరిటెతో ఉడికిన రైస్ బాల్స్ తీసి నూనె పూసిన బోర్డు మీద పెట్టాలి. ఎండుకొబ్బరి పొడిని ఒక గిన్నెలో లేదా పళ్లెంలోకి తీసుకుని అందులో ఉండల్ని దొర్లించాలి. వీటిని అలానే సర్వ్ చేయొచ్చు లేదా రంగురంగుల మఫిన్ పేపర్స్లో చుట్టి ఇవ్వొచ్చు. ఫ్రిజ్లో నిల్వ చేయొద్దు. గాలి చొరబడని డబ్బాలో పెట్టి మూతపెట్టి ఉంచాలి. తయారైన ఒక్క రోజులో తింటే బాగుంటాయి. లేదంటే గట్టిపడతాయి.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









