యూఏఈ లో ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు
- December 14, 2023
యూఏఈ: స్థానిక ధరలను నియంత్రించడానికి వచ్చే ఏడాది మార్చి వరకు ఎగుమతి నిషేధాన్ని భారతదేశం ప్రకటించిన తర్వాత యూఏఈలో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. డిమాండ్కు అనుగుణంగా ధరలు ఆరు రెట్లు పెరిగినందున వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రత్యామ్నాయ వనరుల కోసం చూస్తున్నామని దేశంలోని రిటైల్ పరిశ్రమ అధికారులు చెప్పారు. ఉల్లి ఎగుమతులపై ప్రభావం చూపిందని, ఫలితంగా రిటైల్ ధరలు "కనీసం ఆరు రెట్లు" పెరిగాయని అల్ సఫీర్ గ్రూప్ ఎఫ్ఎంసిజి డైరెక్టర్ అశోక్ తులసియాని తెలిపారు. "టర్కీ, ఇరాన్ మరియు చైనా సంభావ్య ప్రత్యామ్నాయాలు. కానీ పరిమాణం, నాణ్యత మరియు ధరల పరంగా, భారతీయ ఉల్లిపాయలు ఇప్పటికీ ఉత్తమమైనవి. కస్టమర్ల డిమాండ్ వాటికే ఎక్కువ. " తులసియానీ తెలిపారు. న్యూఢిల్లీలో ఉల్లిపాయల ధరలు కిలోకు రూ.70-80కి పెరిగిన తర్వాత, భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఉల్లిపాయల ఎగుమతిని మార్చి 31, 2024 వరకు నిషేధించింది.
తాజా వార్తలు
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు







