‘స్పిరిట్’ సంగతేంటి.! సందీప్ రెడ్డీ.!
- December 15, 2023
ఒక్క సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఆశ్చర్యమేంటంటే, టాలీవుడ్లోనూ, బాలీవుడ్లోనూ కూడా అదే సినిమా ఆయనను స్టార్ డైరెక్టర్ని చేసేయడమే.
ఆయన మరెవరో కాదు, ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషనల్ అనిపించుకున్న సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’ ఏదో అలా కలిసొచ్చేసిందంతే. అదే రీమేక్ మళ్లీ హిందీలోనూ కలిసొచ్చేసింది. లక్కంటే ఇదేనేమో.!
అయితే, ఆయన ఎన్ని సినిమాలు తీసినా అందులోని హీరో, మరియు సోల్ ఒకే తరహాలో వుంటాయని ప్రేక్షకులు ఓ అంచనాకి వచ్చేశారు.
అప్పట్లో ‘అర్జున్ రెడ్డి’ పలు వివాదాలకు పోగా.. ఏదో మ్యాజిక్ జరిగింది. అద్భుతమైన విజయం అందుకుంది. ఇప్పుడు ‘యానిమల్’ ముచ్చట కూడా అంతే.
పిచ్చ పిచ్చగా తిట్టుకుంటూనే ఈ సినిమాని ఆదరించేశారు ప్రేక్షక జనం. దాంతో, బాక్సాఫీస్ వద్ద కాసుల పంట కురుస్తోంది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా.. ‘యానిమల్’ వసూళ్లు రాబడుతోంది.
ఈ క్రేజ్ చూసి, ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో సందీప్ రెడ్డి వున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సీక్వెల్ పట్టుకుని కూర్చుంటే.. ప్రబాస్తో చేయాల్సిన ‘స్పిరిట్’ సంగతేంటీ.! అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
అలాగే, ప్రబాస్తోనూ మళ్లీ ‘యానిమల్’ సినిమానే తీస్తాడు సందీప్ రెడ్డి వంగా.! ఇప్పట్లో చేయకపోతేనే బెటర్.! అనే అభిప్రాయాల్లోనూ కొందరున్నారు. మరి, సందీప్ రెడ్డి మనసులో ఏముందో తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాలి. ప్రస్తుతం ఆయన ‘యానిమల్’ సక్సెస్ని ఎంజాయ్ చేసే పనిలో వున్నాడు మరి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









