విమాన కుదుపులతో పలువురికి గాయాలు

- May 28, 2016 , by Maagulf
విమాన కుదుపులతో పలువురికి గాయాలు

మనీలా నుంచి మనామా వెళుతున్న విమానంలో కుదుపుల కారణంగా పలువురికి చిన్న చిన్న గాయాలయ్యాయి. పెద్ద గాయాలేమీ కాకపోయినా, ప్రయాణీకులు కుదుపులతో ఆందోళన చెందారు. గల్ఫ్‌ ఎయిర్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విమానాన్ని ముంబై ఛత్రపతి శవాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కి మళ్లించడం జరిగింది కుదుపుల కారణంగా. ఓ ప్యాసింజర్‌ని విమానం ల్యాండ్‌ అయిన తర్వాత ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక్కోసారి ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కుదుపులకు గురైన విమానాన్ని ఎ330 విమానంగా గుర్తించారు. ముంబై నుంచి జిఎఫ్‌ 155 విమానం పూర్తిస్థాయి తనిఖీల అనంతరం టేకాఫ్‌ అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com