ఇజ్రాయెల్ కు భారీ షాక్..
- December 19, 2023
ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం రోజురోజుకు భీతావహంగా తయారవుతోంది. హమాస్ మిలిటెంట్ల అంతమే అంతిమ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై విరుచుకు పడుతోంది. ఓవైపు భూతల దాడులు, మరోవైపు వైమానిక దాడులతో ఆ ప్రాంతంలో మారణ హోమం సృష్టిస్తోంది. ఈ దాడుల్లో సామాన్య పౌరులతో పాటు పొరపాటున తమ బంధీలను కూడా చంపుకుంటోంది. ఇలా గాజాపై నిరంతరంగా యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హమాస్కు మద్దతుగా లెబనాన్లోని మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ఇజ్రాయెల్పై ఎదురుదాడులకు తెగబడింది. తాజాగా అత్యంత దుర్భేద్యమైన ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థపై ఈ సంస్థ దాడి చేయడంతో ఇజ్రాయెల్కు గణనీయంగా నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఉత్తర ఇజ్రాయెల్లోని కబ్రి ప్రాంతంలో రెండు ఐరన్ డోమ్ వ్యవస్థలపై దాడి చేసినట్లు హెజ్బొల్లా ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో రెండు లాంచింగ్ ప్లాట్ఫామ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. హెజ్బొల్లా ప్రకటనపై మాత్రం ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు. ఈ మిలిటెంట్ గ్రూప్ను లక్ష్యంగా చేసుకుని దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..









