ఐపీఎల్ 2024 మినీ వేలంలో చరిత్ర సృష్టించిన పాట్ కమిన్స్..
- December 19, 2023
దుబాయ్: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. రూ.2 కోట్ల బేస్ప్రైజ్తో వేలంలోకి వచ్చిన అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ధర పెరిగిపోవడంతో మిగిలిన ఫ్రాంచైజీలు పక్కకు తప్పుకున్నాయి.
అయినప్పటికీ ఈ ఆసీస్ కెప్టెన్ ను దక్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ నువ్వా నేనా అన్నట్లుగా ధరను పెంచుకుంటూ పోయాయి. చివరకు సన్రైజర్స్ హైదరాబాద్ రూ.20.50కోట్లకు కమిన్స్ను దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం.
కాగా.. 2018 ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్కరన్ను పంజాబ్ కింగ్ రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రికార్డును కమిన్స్ బద్దలు కొట్టాడు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







