ఐపీఎల్ 2024 మినీ వేలంలో చరిత్ర సృష్టించిన పాట్ కమిన్స్..
- December 19, 2023
దుబాయ్: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. రూ.2 కోట్ల బేస్ప్రైజ్తో వేలంలోకి వచ్చిన అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ధర పెరిగిపోవడంతో మిగిలిన ఫ్రాంచైజీలు పక్కకు తప్పుకున్నాయి.
అయినప్పటికీ ఈ ఆసీస్ కెప్టెన్ ను దక్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ నువ్వా నేనా అన్నట్లుగా ధరను పెంచుకుంటూ పోయాయి. చివరకు సన్రైజర్స్ హైదరాబాద్ రూ.20.50కోట్లకు కమిన్స్ను దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం.
కాగా.. 2018 ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్కరన్ను పంజాబ్ కింగ్ రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రికార్డును కమిన్స్ బద్దలు కొట్టాడు.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







