బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కోసం పోలీసుల గాలింపు.!
- December 20, 2023
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ పూర్తయ్యాకా కూడా సంచలనంగా వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణం ఈ సీజన్ విజేత అయిన పల్లవి ప్రశాంత్.
రైతు బిడ్డగా హౌస్లో ప్రవేశించిన పల్లవి ప్రశాంత్ ఓ వర్గం ఆడియన్స్ మెప్పు పొందాడు. కానీ, అనవసరమైన ఆటిట్యూడ్తో మరో వర్గంలో తీవ్రమై వ్యతిరేకత కూడా పొందాడు.
ఎట్టకేలకు ఫైనలిస్ట్గా మారి, బిగ్బాస్ ట్రోఫీ కూడా గెలుచుకున్నాడు. అంతా బాగానే వుంది కానీ, ఫైనలిస్టుని ప్రకటించడంలో ఏదో మస్కా చస్కా జరిగిందన్న అనుమానాలున్నాయ్.
దాంతో, రన్నర్గా నిలిచిన అమరదీప్ అభిమానులకీ, పల్లవి ప్రశాంత్ అభిమానులకీ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయ్. చిలికి చిలికి గాలివానలా మొదలైన ఈ గొడవ తారా స్థాయికి చేరుకోవడం, అది కాస్తా బిగ్బాస్ నిర్వహకులకు తెలియడంతో ట్రోఫీ అందించాకా గుట్టు చప్పుడు కాకుండా, బిగ్బాస్ హౌస్ వెనక ద్వారం నుంచి పల్లవి ప్రశాంత్ని పంపించే ప్రయత్నం చేశారు నిర్వహకులు.
కానీ, అది పట్టించుకోని పల్లవి ప్రశాంత్ ఆటిట్యూడ్ చూపించి, ప్రవేశ ద్వారం ద్వారా పబ్లిక్గా వచ్చాడు. దాంతో, అల్లరి పెద్దదైంది. అక్కడే వున్న అమరదీప్ తదితర ఇతరత్రా కంటెస్టెంట్లపై దాడికి దిగారు పల్లవి ప్రశాంత్ అభిమానులు.
అక్కడితో ఆగలేదు.. ఆర్టీసీ బస్సుల పైనా వారు రాళ్లు రువ్వారు. దాంతో, పోలీసులు పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు చేసి, అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. అతను పరారీలో వున్నట్లు గుర్తించారు. అతని కోసం స్పెషల్ పోలీస్ టీమ్ గాలింపు చర్యలు చేపట్టిందని సమాచారం.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







