‘యాత్ర 2’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
- December 21, 2023
హైదరాబాద్: యాత్ర 2 2019లో ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్రెడ్డి స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ యాత్ర. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సూపర్ హిట్ మూవీ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర 2. వైఎస్. రాజశేఖర్రెడ్డి తనయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలా వుంటే.. గురువారం (డిసెంబర్ 21) వైఎస్ జగన్ పుట్టినరోజుని పురస్కరించుకుని యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్లో ఒకవైపు జీవా కూర్చొని ఉండగా.. మరోవైపు మమ్ముట్టి ఉన్నాడు. ఈ పోస్టర్లో ”నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్. రాజశేఖర్రెడ్డి కొడుకుని” అంటూ పోస్టర్లో రాసుకోచ్చారు. ఇక ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా వైఎస్ జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు.
త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







