ఈ నెల 24న సూర్యకాంతం శతాబ్ధి పురస్కారాలు..
- December 21, 2023
ఎఫ్టిపీసీ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య జంగా, పీవీఎస్ వర్మ వెల్లడి
హైదరాబాద్: తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందిన అలనాటి నటీమణి సూర్యకాంతం పేరిట ఫిలింనగర్లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఈ నెల 24న సూర్యకాంతం శతాబ్ధి పురస్కారాలను ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్టిపీసీ ఇండియా), తెలుగు సినిమా వేదిక సంయుక్త నిర్వహణలో అందజేస్తున్నట్లు ఎఫ్టిపీసీ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య జంగా, పీవీఎస్ వర్మ సంయుక్త ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రంగాలలో విశిష్ట ప్రతిభాపాటవాలు కలిగిన విభిన్న రంగాల్లోని వ్యక్తులకు సూర్యకాంతం లాంటి మహానటి పేరుమీద వంద సంవత్సరాల శత జయంతిని పురస్కరించుకుని ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఏఎన్నార్ల పేరిట ఘనంగా అవార్డులు ప్రదానం చేశామని ఎఫ్టిపీసీ ఇండియా నిర్వాహకులు తెలిపారు. ఎఫ్టిపిసి ఇండియా వరల్డ్ రికార్డు సాధించడం మరో మైలురాయి అని, పాత తరం వారిని స్మరించుకుంటూ కొత్త వారికి స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భదర్వాజ, ప్రముఖ నటులు శ్రీకాంత్, శివాజీరాజా, అన్నపూర్ణ, జ్యోతి, తదితర ప్రముఖ తారాగణం హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్గా మా గల్ఫ్ న్యూస్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









