మళ్లీ విజృంభించిన కరోనా మహమ్మారి..
- December 23, 2023
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నెల రోజుల్లో 52 శాతం పాజిటివ్ కేసులు పెరిగాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్ లోనూ కరోనా కలవరం రేపుతోంది. మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏడు నెలల గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 748 కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. కేరళలో ఇద్దరు, కర్ణాటక లో ఒకరు రాజస్థాన్ లో ఒకరు కరోనా బారిన పడి మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 3420 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కేరళలో 266 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2,872 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. తెలంగాణలో కొత్తగా 8 కోవిడ్ కేసులు, ఏపీలో 8 కోవిడ్ కేసులు నమోదు, తమిళనాడులో 15, కర్ణాటకలో 70 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
ప్రస్తుతం తెలంగాణలో 27 యక్టీవ్ కేసులు, ఏపీలో 12 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. జేఎన్.1 కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇప్పటి వరకు దేశంలో 22 జేఎన్.1 కేసులను గుర్తించారు. కేరళ, గోవాలోనే అత్యధికంగా జేఎన్.1 కేసులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







