మున్సిపల్ కౌన్సిల్స్ సింపోజియం-2023 ప్రారంభం
- December 24, 2023
మస్కట్: మునిసిపల్ కౌన్సిల్స్ సింపోజియం 2023 ప్రారంభోత్సవంలో ఒమన్ సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైథమ్ అల్ సయీద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఇది రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సింపోజియంలో 4 సెషన్లు ఉన్నాయి. ఈ సమయంలో 6 వర్కింగ్ పేపర్లు సమర్పించబడతాయి. లీగల్ వ్యవహారాల అంతర్గత వ్యవహారాల మంత్రి సలహాదారు మరియు సింపోజియం ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ షేక్ డాక్టర్ షిహాబ్ బిన్ అహ్మద్ అల్ జబ్రీ మాట్లాడుతూ.. ఈ సింపోజియం లక్ష్యాలను సాధించడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తిగా ఉందన్నారు. గవర్నరేట్లను అభివృద్ధి చేయడానికి మునిసిపల్ కౌన్సిల్ల సభ్యులకు అభివృద్ధి మరియు సామాజిక అంశాలపట్ల అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ కూడా అంతర్గత మంత్రిత్వ శాఖ రూపొందించిన “తాన్మియా” అప్లికేషన్ను ప్రారంభించారు. ఇది మునిసిపల్ కౌన్సిల్లకు డిజిటల్ ఇంటర్ఫేస్. ఒమానీ సొసైటీ మరియు గవర్నరేట్లలో మునిసిపల్ కౌన్సిల్ల మధ్య కమ్యూనికేషన్, పారదర్శకత పెంపొందించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









