ఎన్టీఆర్, నాగచైతన్యలు ఢీ కొట్టడానికి రెడీ
- May 29, 2016
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పోటి లేకుండా సినిమా రిలీజ్ చేయటం కష్టంగా మారుతోంది. స్టార్ వారసుల తాకిడి పెరిగిపోవటంతో పాటు భారీ సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతుండటంతో ఎలాంటి పోటి లేకుండా సోలోగా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించటం లేదు. స్టార్ హీరోలు బరిలో ఉన్న సమయంలో చిన్న హీరోలు కాస్త సైడ్ ఇచ్చినా అప్పుడప్పుడు తలపడక తప్పటం లేదు.అదే బాటలో యంగ్ హీరోస్ ఎన్టీఆర్, నాగచైతన్యలు ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. పెద్దగా సినిమా సందడి కనిపించని ఆగస్టు నెలలో ఈ ఇద్దరి సినిమాలు బరిలో దిగుతున్నాయి. జనతా గ్యారేజ్ సినిమా మొదలు పెట్టినప్పుడే ఆగస్టు 12న రిలీజ్ అంటూ ప్రకటించేశాడు తారక్. అందుకు తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో నాగచైతన్య. మళయాల సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ కు రీమేక్ గా అదే పేరుతో తెరకెక్కుతున్న సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. చైతూ సరసన శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి.అయితే ఈ రెండూ వేరు వేరు జానర్ ల సినిమాలు కావటంతో ఒకేసారి రిలీజ్ అయినా పెద్దగా ఇబ్బంది ఉండదన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఇతర హీరోల సినిమాలేవి లేకపోవటంతో థియేటర్ల సమస్య కూడా ఉండదన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్ సభ్యులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు







