అబుధాబి: BAPS హిందూ మందిర్ ప్రారంభోత్సవం.. ప్రధానికి ఆహ్వానం
- December 28, 2023
న్యూఢిల్లీ: అబుధాబిలోని BAPS హిందూ మందిరం ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. BAPS తరఫున స్వామి ఈశ్వరచరందాస్, స్వామి బ్రహ్మవిహారిదాస్, డైరెక్టర్ల బోర్డు సభ్యులు ప్రధానిని ఆహ్వానించారు. 14 ఫిబ్రవరి 2024న జరగనున్న ప్రారంభోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు ప్రధాని అంగీకరించినట్లు ప్రతినిధులు తెలిపారు. అంతకుముందు స్వామి ఈశ్వరచరందాస్ ప్రధానమంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచ సామరస్యం, అబుదాబి ఆలయ ప్రాముఖ్యత మరియు ప్రపంచ వేదికపై భారతదేశ ఆధ్యాత్మిక నాయకత్వం కోసం వారు చర్చించారు. మహంత్ స్వామి మహరాజ్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీశారు. అబుదాబిలోని BAPS హిందూ మందిర్ ప్రాజెక్ట్లోని చైర్మన్ అశోక్ కొటేచా, వైస్ చైర్మన్ యోగేష్ మెహతా, డైరెక్టర్ చిరాగ్ పటేల్ లతోపాటు ఇందులో భాగస్వామ్యమైన వారందరిని అభినందించారు. స్వామి బ్రహ్మవిహారిదాస్ అబుదాబిలోని BAPS హిందూ మందిర్ వైభవాన్ని ప్రధానికి వివరించారు.


తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







