ఆ కంపెనీలకు 96,000 దిర్హాంల జరిమానా!
- January 02, 2024
యూఏఈ: 14 నిర్దిష్ట ఆర్థిక రంగాలలో పనిచేస్తున్న 20-49 మంది ఉద్యోగులతో 12,000 కంటే ఎక్కువ కంపెనీలు ఇప్పుడు 2024లో కనీసం ఒక యూఏఈ పౌరుడిని, 2025లో మరొకరిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) ఇటీవల సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది. ఆయా కంపెనీలు తమ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను త్వరగా చేరుకోవాలని మోహ్రే ఆ ప్రకటనలో సూచించింది. 2024లో నియమించబడని ప్రతి యూఏఈ పౌరుడికి Dh96,000 జరిమానాలు ఈ కంపెనీలపై విధించబడతాయని హెచ్చరించింది. 2025 లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే Dh108,000 జరిమానాలు విధించబడతాయని మొహ్రే స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రోగ్రామ్ నుండి ప్రయోజనం పొందేందుకు ప్రైవేట్ కంపెనీలు నఫీస్(Nafis) ప్లాట్ఫారమ్లో నమోదు చేసుకోవడం చాలా కీలకం అని మంత్రిత్వ శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









