రియాద్కు HQలను తరలించిన 200 సంస్థలు!
- January 02, 2024
రియాద్: సౌదీ అరేబియా రాజధాని నగరం రియాద్ కు 200 కంటే ఎక్కువ అంతర్జాతీయ కంపెనీలు తరలివచ్చాయి. ఈ సంస్థలు జనవరి 1, 2024 తర్వాత ప్రభుత్వ ఒప్పందాలను పొందాలనుకుంటే అంతర్జాతీయ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాన్ని రాజ్యానికి మార్చాలని ఆదేశాలకు లోబడి ఆయా సంస్థల తమ కార్యాలయాలను రియాద్ కు తరలించారు. గ్లోబల్ కమర్షియల్ హబ్గా రియాద్ స్థానాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ విధానం ఇప్పటికే కార్పొరేట్ సంస్థల ప్రశంసలు అందుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ నుండి, నార్తర్న్ ట్రస్ట్, బెచ్టెల్, వైట్ & కేస్, జీఈ హెల్త్కేర్, పెప్సికో మరియు బేకర్ హ్యూస్ వంటి ప్రముఖ సంస్థలు తమ ప్రాంతీయ కార్యాలయాలను రియాద్ కు తరలించాయి. కార్పోరేట్ ఆదాయపు పన్నుపై 30 సంవత్సరాల మినహాయింపు, ప్రధాన కార్యాలయ కార్యకలాపాలకు సంబంధించిన విత్హోల్డింగ్ పన్ను, ప్రత్యేక తగ్గింపులు వంటి సమగ్ర మద్దతు సేవలలో ఆయా కంపెనీలకు రాయితీ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









