కడుపులో మంటను అశ్రద్ధ చేస్తున్నారా.?
- January 11, 2024కడుపులో మంట.. ఏసీడీటీ.. పేరు ఏదైనా ఈ బాధను భరించడం చాలా కష్టమే. సమస్య చిన్నదే కానీ, ఆ టైమ్లో కలిగే బాధ వర్ణనాతీతం. ఎవరికి వస్తే వాళ్లకే తెలుస్తుంది.
ఈ మంటను తగ్గించుకోవడానికి ఈనో తదితర మందులు అందుబాటులో వున్నప్పటికీ వీటిని రెగ్యులర్గా వాడడం వల్ల కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదముంది.
అందుకే సహజ సిద్ధంగానే కడుపులో మంట లేదా ఏసీడీటీ సమస్యను తగ్గించుకోవడం మంచిదని నిపుఫులు చెబుతున్నారు.
అందుకోసం ఓ చిన్న చిట్కా కూడా సూచిస్తున్నారు. జీలకర్ర ఎసీడీటీకి మంచి ఔషధం.
జీలకర్రను లైట్గా సన్నని మంటపై వేడి చేసి పొడి చేసి నీటిలో వేసి మరిగించి దానికి కాస్త నల్లఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే కడుపులో మంటకు చక్కని ఉపశమనం కలుగుతుంది.
అలాగే వాము, జీలకర్ర కలిపి నీటిలో వేసి మరిగించి కాస్త పసుపు, ఉప్పు చేర్చి ప్రతీరోజూ ఉదయం పరగడుపున కానీ, రాత్రి పడుకునే ముందు కానీ, తాగినా ఈ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది.
మజ్జిగ కూడా ఏసీడీటీ సమస్యకు ఇన్స్టెంట్ ఉపశమనం అందిస్తుంది. అలాగే, ప్రతీరోజూ మజ్జిగ తాగడం అలవాటున్న వారిలో ఏసీడీటీ సమస్య వుండదని చెబుతుంటారు.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్