కడుపులో మంటను అశ్రద్ధ చేస్తున్నారా.?
- January 11, 2024
కడుపులో మంట.. ఏసీడీటీ.. పేరు ఏదైనా ఈ బాధను భరించడం చాలా కష్టమే. సమస్య చిన్నదే కానీ, ఆ టైమ్లో కలిగే బాధ వర్ణనాతీతం. ఎవరికి వస్తే వాళ్లకే తెలుస్తుంది.
ఈ మంటను తగ్గించుకోవడానికి ఈనో తదితర మందులు అందుబాటులో వున్నప్పటికీ వీటిని రెగ్యులర్గా వాడడం వల్ల కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదముంది.
అందుకే సహజ సిద్ధంగానే కడుపులో మంట లేదా ఏసీడీటీ సమస్యను తగ్గించుకోవడం మంచిదని నిపుఫులు చెబుతున్నారు.
అందుకోసం ఓ చిన్న చిట్కా కూడా సూచిస్తున్నారు. జీలకర్ర ఎసీడీటీకి మంచి ఔషధం.
జీలకర్రను లైట్గా సన్నని మంటపై వేడి చేసి పొడి చేసి నీటిలో వేసి మరిగించి దానికి కాస్త నల్లఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే కడుపులో మంటకు చక్కని ఉపశమనం కలుగుతుంది.
అలాగే వాము, జీలకర్ర కలిపి నీటిలో వేసి మరిగించి కాస్త పసుపు, ఉప్పు చేర్చి ప్రతీరోజూ ఉదయం పరగడుపున కానీ, రాత్రి పడుకునే ముందు కానీ, తాగినా ఈ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది.
మజ్జిగ కూడా ఏసీడీటీ సమస్యకు ఇన్స్టెంట్ ఉపశమనం అందిస్తుంది. అలాగే, ప్రతీరోజూ మజ్జిగ తాగడం అలవాటున్న వారిలో ఏసీడీటీ సమస్య వుండదని చెబుతుంటారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









