కడుపులో మంటను అశ్రద్ధ చేస్తున్నారా.?
- January 11, 2024![11 కడుపులో మంటను అశ్రద్ధ చేస్తున్నారా.?](https://www.maagulf.com/godata/articles/202401/eee_1704973529.jpg)
కడుపులో మంట.. ఏసీడీటీ.. పేరు ఏదైనా ఈ బాధను భరించడం చాలా కష్టమే. సమస్య చిన్నదే కానీ, ఆ టైమ్లో కలిగే బాధ వర్ణనాతీతం. ఎవరికి వస్తే వాళ్లకే తెలుస్తుంది.
ఈ మంటను తగ్గించుకోవడానికి ఈనో తదితర మందులు అందుబాటులో వున్నప్పటికీ వీటిని రెగ్యులర్గా వాడడం వల్ల కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదముంది.
అందుకే సహజ సిద్ధంగానే కడుపులో మంట లేదా ఏసీడీటీ సమస్యను తగ్గించుకోవడం మంచిదని నిపుఫులు చెబుతున్నారు.
అందుకోసం ఓ చిన్న చిట్కా కూడా సూచిస్తున్నారు. జీలకర్ర ఎసీడీటీకి మంచి ఔషధం.
జీలకర్రను లైట్గా సన్నని మంటపై వేడి చేసి పొడి చేసి నీటిలో వేసి మరిగించి దానికి కాస్త నల్లఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే కడుపులో మంటకు చక్కని ఉపశమనం కలుగుతుంది.
అలాగే వాము, జీలకర్ర కలిపి నీటిలో వేసి మరిగించి కాస్త పసుపు, ఉప్పు చేర్చి ప్రతీరోజూ ఉదయం పరగడుపున కానీ, రాత్రి పడుకునే ముందు కానీ, తాగినా ఈ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది.
మజ్జిగ కూడా ఏసీడీటీ సమస్యకు ఇన్స్టెంట్ ఉపశమనం అందిస్తుంది. అలాగే, ప్రతీరోజూ మజ్జిగ తాగడం అలవాటున్న వారిలో ఏసీడీటీ సమస్య వుండదని చెబుతుంటారు.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..