కడుపులో మంటను అశ్రద్ధ చేస్తున్నారా.?
- January 11, 2024కడుపులో మంట.. ఏసీడీటీ.. పేరు ఏదైనా ఈ బాధను భరించడం చాలా కష్టమే. సమస్య చిన్నదే కానీ, ఆ టైమ్లో కలిగే బాధ వర్ణనాతీతం. ఎవరికి వస్తే వాళ్లకే తెలుస్తుంది.
ఈ మంటను తగ్గించుకోవడానికి ఈనో తదితర మందులు అందుబాటులో వున్నప్పటికీ వీటిని రెగ్యులర్గా వాడడం వల్ల కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదముంది.
అందుకే సహజ సిద్ధంగానే కడుపులో మంట లేదా ఏసీడీటీ సమస్యను తగ్గించుకోవడం మంచిదని నిపుఫులు చెబుతున్నారు.
అందుకోసం ఓ చిన్న చిట్కా కూడా సూచిస్తున్నారు. జీలకర్ర ఎసీడీటీకి మంచి ఔషధం.
జీలకర్రను లైట్గా సన్నని మంటపై వేడి చేసి పొడి చేసి నీటిలో వేసి మరిగించి దానికి కాస్త నల్లఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే కడుపులో మంటకు చక్కని ఉపశమనం కలుగుతుంది.
అలాగే వాము, జీలకర్ర కలిపి నీటిలో వేసి మరిగించి కాస్త పసుపు, ఉప్పు చేర్చి ప్రతీరోజూ ఉదయం పరగడుపున కానీ, రాత్రి పడుకునే ముందు కానీ, తాగినా ఈ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది.
మజ్జిగ కూడా ఏసీడీటీ సమస్యకు ఇన్స్టెంట్ ఉపశమనం అందిస్తుంది. అలాగే, ప్రతీరోజూ మజ్జిగ తాగడం అలవాటున్న వారిలో ఏసీడీటీ సమస్య వుండదని చెబుతుంటారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు