నైపుణ్యం కలిగిన కార్మికులకు టెక్నికల్ పరీక్షలు తప్పనిసరి
- January 12, 2024
కువైట్: కువైట్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు తప్పనిసరిగా ప్రాక్టికల్ మరియు టెక్నికల్ టెస్ట్లను నిర్వహించేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్తో కుదిరిన అవగాహన ఒప్పందంపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM) సంతకం చేసింది. కొత్త వర్క్ పర్మిట్లకే కాకుండా.. ఇప్పటికే ఉన్న వర్క్ పర్మిట్ల పునరుద్ధరణకు కూడా ఈ పరీక్ష తప్పనిసరి అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇఖామా పునరుద్ధరణకు ముందు కార్మికులు తప్పనిసరిగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ప్రాధాన్యత ఆధారంగా వివిధ వృత్తుల కోసం దశలవారీగా పరీక్ష ప్రారంభించబడుతుంది. సంబంధిత రంగాలలో స్పెషలైజేషన్ని నిర్ధారించడానికి, అర్హత లేని కార్మికులను మార్కెట్ నుండి తొలగించడానికి కాంట్రాక్టు రంగం ప్రాథమికంగా దృష్టి పెడుతుందని అధికార వర్గాలు సూచించాయి.
తాజా వార్తలు
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!







