నైపుణ్యం కలిగిన కార్మికులకు టెక్నికల్ పరీక్షలు తప్పనిసరి
- January 12, 2024
కువైట్: కువైట్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు తప్పనిసరిగా ప్రాక్టికల్ మరియు టెక్నికల్ టెస్ట్లను నిర్వహించేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్తో కుదిరిన అవగాహన ఒప్పందంపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM) సంతకం చేసింది. కొత్త వర్క్ పర్మిట్లకే కాకుండా.. ఇప్పటికే ఉన్న వర్క్ పర్మిట్ల పునరుద్ధరణకు కూడా ఈ పరీక్ష తప్పనిసరి అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇఖామా పునరుద్ధరణకు ముందు కార్మికులు తప్పనిసరిగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ప్రాధాన్యత ఆధారంగా వివిధ వృత్తుల కోసం దశలవారీగా పరీక్ష ప్రారంభించబడుతుంది. సంబంధిత రంగాలలో స్పెషలైజేషన్ని నిర్ధారించడానికి, అర్హత లేని కార్మికులను మార్కెట్ నుండి తొలగించడానికి కాంట్రాక్టు రంగం ప్రాథమికంగా దృష్టి పెడుతుందని అధికార వర్గాలు సూచించాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







