అయోధ్యలో రామ మందిర ప్రారంభం.. ఆఫ్ హాలీడే ప్రకటించిన కేంద్రం

- January 18, 2024 , by Maagulf
అయోధ్యలో రామ మందిర ప్రారంభం.. ఆఫ్ హాలీడే ప్రకటించిన కేంద్రం

అయోధ్య: అయోధ్యలో రామ మందిర ప్రారంభానికి సర్వంసిద్ధమైంది. ఈ నెల 22వ తేదీన ఆయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించే కార్యక్రమానికి సర్వం సిద్ధైంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలోపై దేశవ్యాప్తంగా కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. జనవరి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే అన్ని కార్యాలయాలకు హాఫ్‌ డే సెలవును ప్రకటించారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే వరకు కార్యాలయాలు పనిచేయవు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పోస్టాఫీసులు, బ్యాంకులతో పాటు పలు కేంద్రీయ సంస్థలో ఈ సెలవు అమలు కానున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com