ఢిల్లీ విమానాశ్రయంలో రాకపోకలు బంద్

- January 19, 2024 , by Maagulf
ఢిల్లీ విమానాశ్రయంలో రాకపోకలు బంద్

న్యూ ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయంలో రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తక్షణమే అమల్లోకి వచ్చే ఈ ఆంక్షలు జనవరి 26 వరకూ అమల్లో ఉంటాయని తెలిపింది.

ఉదయం 10.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ ఎటువంటి విమానాలకు అనుమతి లేదని ఈ మేరకు నోటీసులు వెలువరించింది. రిపబ్లిక్ డే వేడుకలను దృష్టిలో ఉంచుకుని భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com