ఆధునిక ఒమన్ ను ఆవిష్కరించే.. కల్చరల్ కాంప్లెక్స్ ప్రారంభం
- January 22, 2024
మస్కట్: ఒమన్ కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదివారం ప్రారంభించారు. ఇది ఆధునిక ఒమన్ ను ఆవిష్కరిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందులో మూడు ప్రధాన భవనాలను కలిగి ఉన్నది. ఒమన్ సుల్తానేట్ కళలు మరియు సాంస్కృతిక, ఆధునిక మరియు చారిత్రక భాగాల సేకరణ, పరిరక్షణ మరియు ప్రదర్శన కోసం కేటాయించారు. ఈ కాంప్లెక్స్లో నేషనల్ థియేటర్, నేషనల్ లైబ్రరీ మరియు నేషనల్ రికార్డ్స్ అండ్ ఆర్కైవ్స్ అథారిటీ భవనాలు, వీటితోపాటు ఎనిమిది ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. 80,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే వీటిలో భవనాలు 400,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం OMR147.8 మిలియన్లు. ఇది ఒమన్ సాంస్కృతిక, సాహిత్య, రంగస్థల మరియు పరిశోధన కార్యకలాపాలకు నిలయంగా మారనుంది. ఈ కాంపౌండ్లో నేషనల్ థియేటర్, నేషనల్ లైబ్రరీ, చిల్డ్రన్స్ పబ్లిక్ లైబ్రరీ, హౌస్ ఆఫ్ ఆర్ట్స్, హౌస్ ఆఫ్ సినిమా, లిటరరీ ఫోరమ్, నేషనల్ రికార్డ్స్ అండ్ ఆర్కైవ్స్ అథారిటీ మరియు గ్యాలరీస్ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్, రెస్టారెంట్లు, ఒక పబ్లిక్ పార్క్ ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









