అబుధాబి-అల్ ధన్నా మధ్య ప్యాసింజర్ రైలు ప్రారంభం
- January 26, 2024
యూఏఈ: అబుధాబి మరియు అల్ ధన్నా నగరాలను కలుపుతూ ఎతిహాద్ రైలు తన మొదటి రైలు ప్రయాణాన్ని గురువారం ప్రారంభించింది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నోక్) మేనేజింగ్ డైరెక్టర్ మరియు గ్రూప్ సీఈఓ డాక్టర్ సుల్తాన్ బిన్ అహ్మద్ అల్ జాబర్, అడ్నాక్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్ సభ్యులు మొదటి రైడ్ లో పాల్గొన్నారు. అనంతరం వారు డాక్టర్ అల్ జాబర్ అల్ రువైస్ ఇండస్ట్రియల్ సిటీలోని అడ్నోక్ మరియు పెట్రోకెమికల్స్ హబ్లో పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్ మాట్లాడుతూ.. యూఏఈ అభివృద్ధికి మరియు భవిష్యత్తు శ్రేయస్సుకు దోహదపడే రవాణా పరిష్కారాలను విజయవంతంగా అమలు చేయడానికి ఎతిహాద్ రైల్తో అడ్నోక్ భాగస్వామ్యం తమ వ్యూహాత్మక ప్రాధాన్యతలతో ఒకటన్నారు. తమ నాయకత్వం యొక్క దార్శనిక ఆదేశాలకు అనుగుణంగా తిహాద్ రైల్ ఛైర్మన్ షేక్ థెయాబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పర్యవేక్షణలో అబుదాబి సిటీ - అల్ ధన్నా సిటీల మధ్య ప్యాసింజర్ రైలు సేవల అభివృద్ధి యూఏఈ యొక్క ప్రధాన వాణిజ్య కేంద్రాలను అనుసంధానించే లక్ష్యంతో చేపట్టిందన్నారు. ముఖ్యంగా పరిశ్రమ, తయారీ, ఉత్పత్తి, లాజిస్టిక్స్ రంగాల్లో పనిచేసేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







